- మరో ఐదుగురు ఇన్ సర్వీస్ ఉద్యోగులపైనా ఉన్నతాధికారుల చర్యలు
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ లోని జయశంకర్అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ ఘటనలో బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్చేశారు. వరంగల్ లోని జూనియర్ అసిస్టెంట్సిద్ధార్థ, టెక్నికల్అసిస్టెంట్, ప్రశ్నాపత్రాల ఇన్ చార్జ్ రమేశ్తో పాటు మరో ఐదుగురు ఇన్సర్వీస్ఉద్యోగులు కూడా సస్పెండ్అయ్యారు.
ఆరు నెలల కింద అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ఆఫీసర్ల(ఏఈఓ) ప్రమోషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఏఈఓలు వరంగల్వర్సిటీలోని జూనియర్ అసిస్టెంట్సహాయంతో ప్రశ్నాపత్రం లీక్ చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
