ఏఈఓ పేపర్ లీక్.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

 ఏఈఓ పేపర్ లీక్..  ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
  • మరో ఐదుగురు ఇన్ సర్వీస్ ఉద్యోగులపైనా ఉన్నతాధికారుల చర్యలు

వరంగల్​ సిటీ, వెలుగు: వరంగల్ లోని జయశంకర్​అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ ఘటనలో బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్​చేశారు. వరంగల్ లోని జూనియర్ ​అసిస్టెంట్​సిద్ధార్థ, టెక్నికల్​అసిస్టెంట్, ప్రశ్నాపత్రాల ఇన్ చార్జ్ రమేశ్​తో పాటు మరో ఐదుగురు ఇన్​సర్వీస్​ఉద్యోగులు కూడా సస్పెండ్​అయ్యారు.

ఆరు నెలల కింద అగ్రికల్చర్ ఎక్స్​టెన్షన్​ఆఫీసర్ల(ఏఈఓ) ప్రమోషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఏఈఓలు వరంగల్​వర్సిటీలోని జూనియర్ అసిస్టెంట్​సహాయంతో ప్రశ్నాపత్రం లీక్ చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.