
దేశం విడిపోయిన తొలి రోజుల్లో పాకిస్తాన్కు అవసరమైన కరెన్సీని మన ఆర్బీఐనే ముద్రించి ఇచ్చింది. నోట్లపై ప్రత్యేకంగా ‘గవర్నమెంట్ఆఫ్ పాకిస్తాన్’ అంటూ ముద్రించేది. నోట్లపై సంతకం మాత్రం ఆర్బీఐ అధికారులదే కావడం విశేషం! ఏడాది తర్వాత పాక్ సొంతంగా కరెన్సీ ముద్రించుకుంది. ఆగస్టు 15, 1947 నుంచి ఇండియా, పాక్ వేర్వేరు దేశాలుగా అధికారికంగా ఏర్పడ్డాయి. దేశ విభజనతో రక్షణ, రైల్వే, సెంట్రల్ట్రెజరీ తదితర శాఖలన్నీ రెండు ముక్కలయ్యాయి. కొత్త దేశంగా ఏర్పడిన పాక్కు రిజర్వ్బ్యాంక్ను తొందరగా ఏర్పాటు చేసుకోవడం సాధ్యంకాలేదు. దీంతో రిజర్వ్బ్యాంక్ఆఫ్ ఇండియానే పాకిస్తాన్ను ఆదుకుంది. దీనికోసం రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్కోసం ఆర్బీఐ రూ.1, 2, 5, 10, 100 నోట్లను నాసిక్లోని ఇండియన్సెక్యూరిటీ ప్రెస్లో ముద్రించింది. ఆర్బీఐ తయారుచేసిచ్చిన ఈ నోట్లు ఏడాది పాటు చెలామణిలో ఉన్నాయి. 1948 లో సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నోట్లను ప్రింట్చేసుకుంది. అప్పటి వరకున్న ఇండియన్కరెన్సీ స్థానంలో కొత్త నోట్లను అమలులోకి తెచ్చింది. ఇండియా ప్రింట్చేసిచ్చిన నోట్లను 1952 జనవరి 15న రద్దు చేసింది.