గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్​ మానేరుకు నీళ్లు

గాయత్రి పంప్ హౌస్ నుంచి  మిడ్​ మానేరుకు నీళ్లు

రామడుగు, వెలుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి రాజరాజేశ్వర(మిడ్​మానేరు​)డ్యామ్​కు నీటిని మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్ట్​ పంప్​హౌజ్​ ఆఫీసర్లు విడుదల చేశారు.  

రెండు భారీ మోటర్ల  ద్వారా గ్రావిటీ కెనాల్​లోనికి నీటిని విడుదల చేయగా వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఆర్ డ్యామ్​లోకి ప్రవేశించాయి. 3,300 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు.