
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్ కు తాగునీటిని అందిస్తున్న కృష్ణా ఫేజ్-–3 రింగ్ మెయిన్-–1 పరిధిలోని ప్రశాసన్ నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు ఉన్న పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్ కు పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. అధికారులు రిపేర్లు చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు రిపేర్లు కొనసాగనున్నాయి. ఆ టైంలో హకీంపేట, గోల్కొండ, టోలిచౌకి, లంగర్ హౌజ్, షేక్ పేట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, తట్టిఖానా, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్, గచ్చిబౌలి తదతర ప్రాంతాల్లో వాటర్సప్లయ్ఉండదని అధికారులు తెలిపారు.