కరీంనగర్ జిల్లా: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. శనివారం ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం, టేకుర్తి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఐకేసీ సెంటర్ల దగ్గర మొలకెత్తిన, తాలు ఉన్నా సరే అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. నెల రోజుల క్రితం దాకా నల్ల చట్టాలు తెచ్చారని బీజేపీని ఆరోపించిన ఈటల రాజేందర్ .. ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. ఆనాడు దెయ్యంగా కనిపించిన బీజేపీ నేడు దేవుత అయిందా అన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములతో పాటు దేవాదాయ భూములను ఏవిధంగా కొన్నావని ప్రశ్నించిన పల్లా.. పదే పదే తాను కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, వైయస్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్లానని ఈటల రాజేందర్ చెబుతున్నాడన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈటల వాళ్ల దగ్గరికి వెళ్ళాడని.. నీకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇచ్చింది కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. నీకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తేనే ప్రజలు ఓట్లు వేశారని గుర్తుంచుకుంటే మంచిదన్నారు పల్లా.
మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం
- తెలంగాణం
- June 13, 2021
లేటెస్ట్
- అగ్రికల్చర్ కోర్సులకు ఐకార్
- మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు
- ఉపాధి కూలీల మీద పడ్డ బండరాయి
- 50 ఫోన్లు రికవరీ...బాధితులకు అందజేత
- బాలానగర్ లో గంజాయి పట్టివేత
- సికింద్రాబాద్ స్థానానికి 10 నామినేషన్లు
- కడియం నన్ను ఇబ్బంది పెట్టిండు: తాటికొండ రాజయ్య
- నేత కార్మికులకు రూ. 50 కోట్లు
- బీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్రెడ్డి
- మేడిగడ్డ బ్యారేజీ వద్ద నేలకు టెస్టులు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి