ట్యాలెంట్​ స్ప్రింట్ నుంచి డబ్ల్యూఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌

ట్యాలెంట్​ స్ప్రింట్ నుంచి డబ్ల్యూఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌

 హైదరాబాద్, వెలుగు : టాలెంట్‌‌‌‌‌‌‌‌ స్ప్రింట్ మహిళా ఇంజనీర్స్ (డబ్ల్యూఈ) ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లోని ఆరో ఎడిషన్ ను ప్రారంభించింది.  దేశవ్యాప్తంగా వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలు గల మొదటి సంవత్సరం చదువుతున్న మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులకు 200 సీట్లను అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ లో చేరే స్టూడెంట్లకు వంద శాతం స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్ ఇస్తారు. అదనంగా నగదు, స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ సదుపాయం కూడా ఉంది.  ఈ ఆర్థిక సహాయం ఔత్సాహిక, అర్హులైన మహిళా ఇంజనీర్లకు చదువు, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ కి ఎంపికైన వాళ్లు గూగుల్ ఇంజనీర్లతో మెంటార్‌‌‌‌‌‌‌‌షిప్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లు, నెట్‌‌‌‌‌‌‌‌వర్కింగ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లకు యాక్సెస్ పొందుతారు.  గూగుల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఉంది.