మూడు సార్లు ఎమ్మెల్యేగా ఏం చేశారు? : ఏఎంసీ చైర్పర్సన్ మనీలా సంజీవ్ యాదవ్

మూడు సార్లు ఎమ్మెల్యేగా ఏం చేశారు? :  ఏఎంసీ చైర్పర్సన్  మనీలా సంజీవ్ యాదవ్

కల్వకుర్తి, వెలుగు: మూడు సార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉండి జైపాల్ యాదవ్  నియోజకవర్గానికి ఏం చేశారని ఏఎంసీ చైర్​పర్సన్  మనీలా సంజీవ్ యాదవ్  ప్రశ్నించారు. ఆదివారం సంజయ్  యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏనాడు వంద పడకల ఆసుపత్రి గురించి పట్టించుకోని జైపాల్​రెడ్డి ఆసుపత్రి నిర్మాణం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. 

ఎలక్షన్ల ముందు హడావుడిగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా జీవో సృష్టించి, హరీశ్​రావుతో కొబ్బరికాయ కొట్టించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైస్  చైర్మన్  పండిత్ రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.