భారత్ లో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందా ? అని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని యానిమేషన్ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
గంటకు గరిష్టంగా 320 కి.మీ స్పీడ్ తో వెళ్లే ఈ రైలు గురించి ప్రస్తావించారు. తమ ప్రభుత్వం కలలు కాదు వాస్తవాలను సృష్టిస్తోందంటూ ట్వీట్ చేశారు. మోడీ 3.0 పాలనలో బుల్లెట్ రైలు కోసం ఎదురుచూడండంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
सपने नहीं हकीकत बुनते हैं!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 12, 2024
Stay tuned for #BulletTrain in Modi 3.0!#ModiKiGuarantee pic.twitter.com/0wEL5UvaY8
ముంబై- అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్లు ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.ప్రయాణ సమయం రెండు గంటలకు తగ్గుతుందని అంచనా.
బుల్లెట్ ట్రైన్ కోసం 24 రివర్ బ్రిడ్జిలు,28 స్టీల్ బ్రిడ్జిలు, 7 పర్వత ప్రాంతాల్లో టన్నె్ల్, 7 సముద్ర మార్గాన 7 టన్నెల్, 12 స్టేషన్ల నిర్మాణం జరగనుంది. మన దేశంలో మొదటి బుల్లెట్ రైలు గుజరాత్ లోని బిలిమోరా- సూరత్ మధ్య 50 కి.మీల విస్తీర్ణంతో 2026 ఆగస్టులో పూర్తవుతుందని రైల్వే మంత్రి ప్రకటించారు.