technology : మొబైల్ నెట్ వర్క్ లేకపోతే ..ఇలా చేయండి

technology : మొబైల్ నెట్ వర్క్ లేకపోతే ..ఇలా చేయండి

ఎంత ఖరీదైన ఫోన్​ ఉన్నా, నెట్​వర్క్​ సిగ్నల్​ లేకపోతే ఫోన్​కాల్స్, మెసేజ్​లు చేయడం కుదరదు. అలాగే రోజువారీ పనులు, ఉద్యోగానికి సంబంధించిన వర్క్స్ అన్నీ మొబైల్​తోనే ముడిపడి ఉంటాయి. మరి అలాంటప్పుడు సిగ్నల్​ సరిగా లేకపోతే ఎలా? 

సిగ్నల్ స్ట్రెంత్​​ పెంచడానికి..

  •     మొబైల్ సిగ్నల్ సరిగా లేనప్పుడు ఫోన్​ని రీబూట్​ చేయాలి.
  •     ఎయిర్​ ప్లేన్​ మోడ్​ని ఆన్​ లేదా ఆఫ్​ చేయాలి. 
  •     సిమ్​ కార్డ్​ సరిగా ఉందో లేదో చెక్​ చేయాలి.
  •     సిగ్నల్​ స్ట్రెంత్​​ స్మార్ట్​ ఫోన్​లో వాడే సిమ్​ కార్డ్​ టైప్​ మీద ఆధారపడి ఉంటుంది. 
  •     సిమ్​ కార్డ్​ పై డస్ట్​ ఉంటే సిగ్నల్​ ప్రాబ్లమ్​ వచ్చే అవకాశం ఉంది.
  •     సిమ్​ కార్డ్​ని మైక్రో ఫైబర్​ క్లాత్​తో శుభ్రం చేశారో లేదో చూసుకోవాలి. 
  •     సిమ్ కార్డ్​పై చిన్న గీతలు పడినా సిగ్నల్​ స్ట్రెంత్​ ఇంటరప్ట్​ అయ్యి సిమ్​ పాడయ్యే అవకాశం ఉంది. అప్పుడు కొత్త కార్డ్​ వేయాలి.
  •     కొన్ని ప్రాంతాల్లో 4జీ లేదా 5జీ నెట్​వర్క్​లకు ఫుల్ సిగ్నల్ స్ట్రెంత్​​ లేదు. స్మార్ట్​ ఫోన్​లలో వీక్ సిగ్నల్ ఉంటే నెట్​వర్క్​ మోడ్​ మార్చాలి. స్మార్ట్​ ఫోన్​లను 4జీ లేదా 5జీ నుంచి 2జీ లేదా 3జీ          నెట్​ వర్క్​లకు మార్చొచ్చు. యూజర్లు నెట్​వర్క్​ మోడ్​​ని మాన్యువల్​గా సెలక్ట్​ చేసుకోవాలి. 

ఆండ్రాయిడ్​లో..

నెట్​వర్క్​ సెట్టింగ్స్​కి వెళ్లి సిమ్​ కార్డ్​ సెట్టింగ్స్​ పై ట్యాప్​ చేయాలి. అడ్జెస్ట్ చేయడానికి సిమ్​ కార్డ్ స్లాట్​ను క్లిక్ చేయాలి. తర్వాత ప్రైమరీ నెట్​వర్క్​ టైప్​ ఆప్షన్​ని సెలక్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్​ స్ట్రెంత్​​ పెరుగుతుంది. 

ఐ–ఫోన్​ అయితే..

సెట్టింగ్స్​లో సెల్యులార్​ ఆప్షన్​ క్లిక్​ చేయాలి. సెల్యులార్ డాటా ఆప్షన్​లో ‘4జీ స్టార్ట్’ స్టాప్​ చేయాలి. అప్పుడు 5జీ లేదా 4జీ నెట్​వర్క్​లు వీక్​గా ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్ పెరుగుతుంది. సెల్యులార్ నెట్​వర్క్​లకు బదులు ఫోన్​లోని కాలర్ సెట్టింగ్స్​లో వైఫై సిగ్నల్ యాక్టివేట్ చేయొచ్చు. పబ్లిక్​ నెట్​వర్క్​ కాకుండా నమ్మకమైన నెట్​వర్క్​లో మాత్రమే ఇది సేఫ్​.