చత్తీస్ గఢ్ విమెన్స్ కమిషన్ చీఫ్ కామెంట్
భోపాల్: చాలామంది మహిళలు లివిన్ రిలేషన్ షిప్ బెడిసికొట్టాక తనపై రేప్ జరిగిందంటూ కంప్లెయింట్ చేస్తున్నారని చత్తీస్ గఢ్ విమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ కిరణ్మయి నాయక్ అన్నారు. ‘‘ ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకున్న మహిళ, అతని గురించి తెలుసుకోవాలి. అతడు నిజం చెబుతున్నాడా లేదా రూడీ చేసుకోవాలి. కలిసి ఉండగలమా లేదా? అని ఆలోచించుకోవాలి. ఇలాంటి సంబంధాలు దెబ్బతిన్నప్పుడు మహిళలు కంప్లెయింట్ చేస్తున్నారు. ఇలాంటి పంచాయితీలు తమ దగ్గరికి వచ్చినప్పుడు, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు. అయితే, నాయక్ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రేప్ బాధితులు కేసు పెట్టొద్దన్నట్లు మాట్లాడారని పలువురు మండిపడుతున్నారు.
For More News..