కలిసున్నప్పుడు ఓకే.. విడిపోయాక రేప్ అంటున్నారు

కలిసున్నప్పుడు ఓకే.. విడిపోయాక రేప్ అంటున్నారు

చత్తీస్ గఢ్ విమెన్స్ కమిషన్ చీఫ్ కామెంట్

భోపాల్: చాలామంది మహిళలు లివిన్ రిలేషన్ షిప్ బెడిసికొట్టాక తనపై రేప్ జరిగిందంటూ కంప్లెయింట్ చేస్తున్నారని చత్తీస్ గఢ్ విమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ కిరణ్మయి నాయక్ అన్నారు. ‘‘ ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకున్న మహిళ, అతని గురించి తెలుసుకోవాలి. అతడు నిజం చెబుతున్నాడా లేదా రూడీ చేసుకోవాలి. కలిసి ఉండగలమా లేదా? అని ఆలోచించుకోవాలి. ఇలాంటి సంబంధాలు దెబ్బతిన్నప్పుడు మహిళలు కంప్లెయింట్ చేస్తున్నారు. ఇలాంటి పంచాయితీలు తమ దగ్గరికి వచ్చినప్పుడు, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు. అయితే, నాయక్ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రేప్ బాధితులు కేసు పెట్టొద్దన్నట్లు మాట్లాడారని పలువురు మండిపడుతున్నారు.

For More News..

కోటి రూపాయల పరిహారం ఇయ్యక 385 కోట్ల ప్రాజెక్ట్​ ఆగింది

పోస్ట్​లో దేవుళ్ల ప్రసాదాలు.. పైలట్ ప్రాజెక్టుగా 10 గుడులు