ఆశావర్కర్ల న్యాయమైన..డిమాండ్లు పరిష్కరించాలె : ​నల్లాల ఓదెలు

ఆశావర్కర్ల న్యాయమైన..డిమాండ్లు పరిష్కరించాలె : ​నల్లాల ఓదెలు

కోల్​బెల్ట్, వెలుగు : ఆశా వర్కర్లకు ఫిక్స్​డ్​వేతనం రూ.18వేలను చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే కల్పించాలని మాజీ విప్ ​నల్లాల ఓదెలు ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. మందమర్రిలో ఆశా వర్కర్స్​చేపట్టిన దీక్షా శిబిరానికి తన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. జాబ్​ఛార్ట్​ను విడుదల చేయాలని, పనిభారం తగ్గించాలన్నారు. ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరారు.

ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ​అండగా ఉంటుందన్నారు. సమ్మెలో భాగంగా సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్​కమిటీ మెంబర్ దూలం శ్రీనివాస్ ​నేతృత్వంలో ఆశా వర్కర్లు ర్యాలీగా ఇంటింటికి వెళ్లి స్థానికులు, బీఆర్ఎస్​ లీడర్లను కలిసి పూలు అందిస్తూ తమ పోరాటానికి మద్దతు కోరారు. ఆశా వర్కర్ సంఘం బాధ్యులు కవిత, సబిత, లక్ష్మి, శ్యామల, రాధ, రూప, మంజుల, స్వరూప తదితరులు పాల్గొన్నారు.