గాంధీనగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రియేసస్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద హెల్త్ స్కీం అని ఆయన కొనియా డారు. గుజరాత్ లోని గాంధీనగర్లో జరుగుతున్న జీ20 హెల్త్ మినిస్టర్ల భేటీలో టెడ్రోస్ మాట్లాడారు. భారత్లో హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలను దర్శించానని, అక్కడ అందుతున్న సౌకర్యాలు అద్భుతమని పొగిడారు. ‘‘గాంధీనగర్లో హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లను సందర్శించాను.
అక్కడ అందిస్తున్న వైద్యసేవలు చూసి ముచ్చటేసిం ది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న టెలిమెడిసిన్ సౌకర్యాలు కూడా బాగున్నాయి. టెలిమెడిసి న్తో స్థానికంగా వైద్యసేవలు అందుతున్నా యి. హెల్త్ కేర్ పరివర్తన చెందుతోందని అనడానికి ఇదే గొప్ప ఉదాహరణ. గ్లోబల్ డిజిటల్ హెల్త్ను లాంచ్ చేయడంలో చొరవ తీసుకున్నందుకు ఇండియాకు థ్యాంక్స్” అని టెడ్రాస్ వ్యాఖ్యానించారు.