
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత డెవలప్డ్ కంట్రీ అయిన యూఎస్ .. కరోనా పాజిటివ్ కేసుల్లోనూ నూ టాప్ ప్లేస్ లో ఉంది. అందులోనూ న్యూయార్క్ సిటీ కరోనాకు కేపిటల్గా మారింది. యూఎస్ అంతటా జరిగిన మరణాల్లో సగం వరకు ఒక్క న్యూయార్క్ సిటీలోనే ఉన్నాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో ఇటలీ, స్పెయిన్దేశాల్లో అత్యంత ఎక్కువ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం న్యూయార్క్ రాష్ట్రం ఆ దేశాలను మించిపోయింది. అమెరికా ఫైనాన్షియల్ స్టేట్, బిగ్ యాపిల్ గా పిలిచే ఈ సిటీలో ఎందుకిన్ని మరణాలు నమోదయ్యాయన్న ప్రశ్నకు టూరిస్టుల తాకిడి, విపరీతంగా జనాభా ఉండటమే కారణమని చెప్తున్నారు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో. అయితే ఇక్కడ లాక్ డౌన్ ప్రకటించడం ఆలస్యం కావడంతోనే వైరస్ ఎక్కువగా విస్తరించిందని హాప్కిన్స్ వర్సిటీ హెల్త్ ఆఫీసర్ అంటున్నారు.
5 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
అమెరికాలో కరోనా బారిన పడి చనిపోయినవారి సంఖ్య 18,763 కు చేరుకుంది. పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల 4 వేలు దాటింది. న్యాయార్క్ రాష్ట్రంలో శుక్రవారం నాటికి దాదాపు 160,000 మంది కరోనా లక్షణాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కరోనాతో అత్యంత నష్టపోయిన యూరప్ కంట్రీస్ అయిన స్పెయిన్, ఇటలీ కంటే అత్యధికంగా 7,800కు పైగా మరణాలు న్యూయార్క్ లో సంభవించాయి. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నమోదైన మరణాల కంటే ఒక్క న్యూయార్క్ లోని మరణాల సంఖ్యే ఎక్కువగా ఉంది.
టూరిస్టుల తాకిడితోనే వైరస్ వ్యాపించింది
ఇక్కడ ఉన్న అత్యధిక జనాభా, టూరిస్టుల తాకిడి వల్లే న్యూయార్క్ ని ఇలా తయారు చేసిందని గవర్నర్ ఆండ్రూ చెప్తున్నారు. సిటీలో దాదాపు 90 లక్షల జనాభా ఉందని, ఒక స్క్వేర్ఫీట్కు ఇక్కడ 10 వేల మంది నివాసం ఉంటున్నారని తెలిపారు. అందువల్లే వైరస్ చాలా వేగంగా స్ప్రెడ్ అయిందంటున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ఉద్యోగులు, టూరిస్టులు ప్రయాణిస్తుండటంతో ఇప్పటివరకు 93000 పాజిటివ్ కేసులు ఫైల్ అయ్యాయని చెప్పారు.
లాక్డౌన్ లేట్ చేశారు కాబట్టే..
అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన కాలిఫోర్నియాలో శుక్రవారం నాటికి 20,200 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 550 మంది చనిపోయారు. కరోనా ఎఫెక్టుతో మార్చి 16 నుంచే కాలిఫోర్నియాలో స్ట్రిక్టుగా ఆర్డర్స్ జారీ చేశాయి కాబట్టే ఇక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఫైల్ కాలేదని జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ హెల్త్ ఆఫీసర్ మేఘన్ మెకంటి చెప్తున్నారు. న్యూయార్క్ లో మార్చి 16న రెస్టారెంట్లు, హోటల్స్, స్కూల్స్ మాత్రమే బ్యాన్ అమలు చేసిన వారం తర్వాత లాక్ డౌన్ అమలు చేశారని, ఈ గ్యాప్ లో వైరస్ ఎంతో మందికి విస్తరించే చాన్స్ ఉందని అంటున్నారు. లాక్ డౌన్ విధించడంలో జాప్యం కారణంగానే వైరస్ అత్యధికంగా వ్యాపించినట్లు చెప్తున్నారు.
యూరప్ నుంచే వైరస్ ఇంపోర్టయింది
మరోవైపు యూరప్ నుంచి వచ్చిన టూరిస్టుల నుంచే న్యూయార్క్ లో కరోనా వ్యాపించిందని అమెరికన్ జన్యు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ లో మార్చి 1న తొలి కరోనా కేసు నమోదైందని, అంతకంటే ముందే యూరప్ లో ఫిబ్రవరిలో కరోనా పాజిటివ్ కేసు ఫైల్ అయిందని చెప్తున్నారు. ఆ తర్వాత మార్చి 2న న్యూయార్క్ లోని న్యూరోషెల్ లో రెండో పాజిటివ్ కేసు నమోదైందన్నారు. దీంతో వెంటనే ఎలర్ట్ అయి మార్చి 16 నుంచి ప్రభుత్వ స్కూల్స్, బార్లు, రెస్టారెంట్లు న్యూయార్క్ స్టేట్ అంతటా క్లోజ్ చేశారు. మార్చి 22 నుంచి గవర్నర్ లాక్డౌన్ ప్రకటించారు.