
పుదుచ్చేరి: ఈ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున మెరుపు బ్యాటింగ్తో వెలుగులోకి వచ్చిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇప్పుడు తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో ఔరా అనిపించాడు. దేవధర్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో స్టన్నింగ్ క్యాచ్తో సౌత్ జోన్ బ్యాటర్ రిక్కీ భుయ్ (39)ను పెవిలియన్ చేర్చాడు.
39వ ఓవర్లో మయాంక్ యాదవ్ వేసిన బాడీలైన్ బాల్ను రిక్కీ ఫస్ట్ స్లిప్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. ముందుగా కొంచెం లెఫ్ట్ సైడ్ జరిగిన కీపర్ ప్రభ్ రైట్ సైడ్ అమాంతం గాల్లోకి డైవింగ్ చేస్తూ క్యాచ్ పట్టుకున్నాడు. ప్రభ్సిమ్రాన్ క్యాచ్తో కేకపుట్టించినప్పటికీ ఈ మ్యాచ్లో నార్త్ జోన్ 185 రన్స్ (డక్వర్త్) తేడాతో సౌత్ జోన్ చేతిలో ఓడింది.