సిద్దిపేట జిల్లాలో ఘటన .. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

సిద్దిపేట జిల్లాలో ఘటన  .. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

దుబ్బాక, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. సీఐ మున్నూరు కృష్ణ కథనం ప్రకారం..సిద్దిపేట జిల్లా అక్బర్​పేట-భూంపల్లి మండలం రామేశ్వరంపల్లికి చెందిన మైలీ నవీన్​(35) గల్ఫ్​ వెళ్లి వచ్చి ఊరిలో ఆటో నడుపుకుంటున్నాడు. ఇతడి భార్య ఉదయ రాణి ఇదే గ్రామానికి చెందిన శ్యామ తరుణ్​(సబ్ స్టేషన్​ ఆపరేటర్)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

దీంతో తరుణ్​, ఉదయరాణి కలిసి నవీన్​ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి నవీన్​కు తరుణ్​ మద్యం తాగించాడు. అతడు ఇంటికి వచ్చి పడుకున్నాక ఇద్దరూ కలిసి నవీన్​ను సంపులో ముంచి చంపేశారు. తెల్లవారుజామున ఉదయరాణి నవీన్ ​సోదరుడికి ఫోన్​చేసి భర్త లేవడం లేదని చెప్పింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉదయరాణి, తరుణ్​ను విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.