న్యూఢిల్లీ : చైనా నుంచి బైటకు వద్దామనుకుంటున్న మల్టీ నేషనల్ కంపెనీలను (ఎంఎన్సీలు) ఆకట్టుకునేందుకు తగిన బ్లూప్రింట్ సిద్ధం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. చైనా వదిలే వివిధ దేశాలకు చెందిన తయారీ రంగ ఎంఎన్సీలను గుర్తించి, కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో వివరిస్తూ ఆ ఎంఎన్సీలకు ఆ బ్లూప్రింట్ ద్వారా తెలియచెప్పనున్నట్లు పేర్కొన్నారు. ఐఎంఎఫ్–వరల్డ్ బ్యాంక్ మీటింగ్ ముగిసిన తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. చైనా వద్దనుకుంటున్న కొన్ని ఎంఎన్సీలు ఇండియాకు రావాలని కోరుకుంటున్నాయని, వారి ఆశలకు తగినట్లుగా విధానాలు రూపొందించడం ప్రభుత్వానికి చాలా ముఖ్యమని వెల్లడించారు. దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ఇప్పటికే కిందటి నెలలో కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ రంగంలోని మల్టీ నేషనల్స్ సప్లై చెయిన్లోని ఇండియా కంపెనీలకు ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆపిల్ లాంటి పెద్ద తయారీ రంగ కంపెనీ ఇండియాకు వస్తే, ఆ ప్రభావం మిగిలిన కంపెనీలపైనా పడుతుందని సీతారామన్ అభిప్రాయపడ్డారు. వియత్నాంలో అవకాశాలు అడుగంటుతున్నాయని, ముఖ్యంగా పనిచేసే మనుషులు అక్కడ దొరకడం లేదని వ్యాఖ్యానించారు. కాబట్టి, చైనా నుంచి వచ్చే కంపెనీలు ఇండియా వైపే ప్రధానంగా దృష్టి పెడతాయని అభిప్రాయపడ్డారు.
చైనాను వదిలే కంపెనీలకు కేంద్రం రెడ్ కార్పెట్
- దేశం
- October 21, 2019
లేటెస్ట్
- కానిస్టేబుల్ అత్యుత్సాహం.. గాయాలపాలైన ఓ కుటుంబం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం
- Lok sabha Election 2024: ఓటు వేయని మూడు గ్రామాలు .. రీజన్ ఇదే
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కమిటీ
- శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
- Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..
- నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..
- మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు
Most Read News
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం