- అవసరమైతే లోన్లు ఇప్తిస్తం
- నిర్వీర్యమైన తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తం
- రైస్మిల్లర్ల ఆటలు ఇక సాగవ్
- బెల్ట్షాపుల విషయంలో రేవంత్రెడ్డిని అభినందిస్తున్నా
- ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
రాయికల్, వెలుగు : మహాలక్ష్మి స్కీంతో ఉపాధి కోల్పోయామని బాధపడుతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నట్టు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్లోని కాంగ్రెస్ఆఫీసులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లు గిరాకీల్లేక తిప్పలు పడుతున్నామని ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి నిలదొక్కుకునేలా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బెల్టుషాపులను పూర్తిగా రద్దు చేసేంత వరకు నిద్రపోరన్నారు. ఈ విషయంలో ఆయనను అభినందిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం మిషన్భగీరథ అంటూ రాయికల్, జగిత్యాల మండలంలోని పొలాస, బీర్పూర్ మండలాల్లోని ఫిల్టర్ బెడ్లను నిర్వీర్యం చేసిందని, వాటిని పునరుద్ధరించేందుకు అధికారులతో కలిసి పరిశీలించానని చెప్పారు.
ఆఫీసర్లను అంచనాలు రూపొందించాలని కూడా చెప్పామని, ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదన్నారు. ధాన్యం కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని, రైస్ మిల్లర్ల ఆటలు ఇక సాగవన్నారు. సెంటర్ల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మిల్లులకు పంపుతామని, అక్కడ కోతలు లేకుండా చూస్తామన్నారు. ఈనెల17న ఎస్సారెస్పీ ఆఫీసర్లతో మాట్లాడతానని, రైతులకు కాల్వల ద్వారా నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయికల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసు పునరుద్ధరణ కోసం రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడతానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు కొండపెల్లి రవీందర్రావు, లీడర్లు ఎద్దండి దివాకర్రెడ్డి, మ్యాకల రమేశ్, మహిపాల్రెడ్డి, బాపురం నర్సయ్య, ఆరె శ్రీను, మండ రమేశ్, శ్రీకాంత్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.