మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌‌‌‌‌

మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌‌‌‌‌

వింబుల్డన్‌‌‌‌‌‌‌‌: వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌, పోలెండ్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో ఈజీగా మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించగా, టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌, ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌ అంచనాలను అందుకున్నారు. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌‌‌‌‌ 6–2, 6–0తో సోరిబెస్‌‌‌‌‌‌‌‌ టోర్మో (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది. గంటా 10 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పోలెండ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌కు టోర్మో నుంచి ప్రతిఘటన ఎదురుకాలేదు. 

మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో టోర్మో నాలుగు డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్​ చేయగా, స్వైటెక్‌‌‌‌‌‌‌‌ 9 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఆరింటిని కాచుకుంది. 27 విన్నర్స్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 8వ సీడ్‌‌‌‌‌‌‌‌ సకారి (గ్రీస్‌‌‌‌‌‌‌‌) 6–0, 5–7, 2–6తో కొస్టుయెక్‌‌‌‌‌‌‌‌ (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌) చేతిలో కంగుతినగా, కసాట్కినా (రష్యా) 6–0, 6–2తో బురాగే (బ్రిటన్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో మూడోసీడ్‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా) 7–5, 6–4, 6–3తో పెరీ (గ్రీస్‌‌‌‌‌‌‌‌)పై, 9వ సీడ్‌‌‌‌‌‌‌‌ ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–4, 2–6, 4–6, 7–5, 6–3తో హన్ఫామన్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)పై గెలిచి మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు.