50 నిమిషాల్లో 3 పరోటాలు తింటే లక్ష రూపాయలు ప్రైజ్

50 నిమిషాల్లో 3 పరోటాలు తింటే లక్ష రూపాయలు ప్రైజ్

హర్యానా రోహతక్ లోని హోటల్ తపస్య అంటే పరోటాలకు చాలా ఫేమస్. అక్కడ పరోటాలు అమ్మడమే కాదు… 2006 నుంచి పరోటాల పోటీ నిర్వహిస్తున్నారు. మూడు పరోటాలు 50 నిమిషాల్లో తింటే లక్ష రూపాయల బహుమతితో పాటు జీవితాంతం ఫ్రీగా భోజనం అందిస్తారు. అయితే ఒక్కో పరోటా సైజు రెండున్నర అడుగులు ఉంటుంది. ఆ పరోటా మధ్యలో రెండు కిలోల కుర్మా ఉంటుంది. ఆలూ మిక్స్, ఆనియన్, కాలీఫ్లవర్ కుర్మాలను ఈ పరోటాల్లో వినియోగిస్తారు.

దాదాపు ఐదుగురు తినేంతగా ఉంటుంది ఈ ఒక్కో జంబో పరోటా. వీటి ధర రూ.300 నుంచి మొదలవుతాయి. నేతితో తయారయ్యే ఈ భారీ పరోటాలను తినేందుకు స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వస్తుంటారు.  పరోటాల పోటీ గత 14 ఏళ్లుగా జరుగుతున్నా ఇప్పటివరకు నెగ్గింది ఇద్దరే.