దేశ వ్యాప్తంగా కరోనా స్పీడ్ పెంచింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5609 పాజిటివ్ కేసులు నమోదు కాగా 132 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359 కు చేరింది మృతుల సంఖ్య 3435 కు చేరింది. ఇప్పటి వరకు భారత్ లో 45300 మంది కరోనా నుంచి కోలుకోగా 63624 చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
అత్యధికంగా మహారాష్ట్రలో 39297 కేసులు నమోదవ్వగా1390 మంది చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో 13191,గుజరాత్ 12539, ఢిల్లీ 11088 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా గుజరాత్ లో 749, మధ్యప్రదేశ్ లో 267,పశ్చిమ బెంగాల్ లో 253 మంది కరోనాతో చనిపోయారు.
see more news