కస్టమర్లకు బెస్ట్ ఎక్స్​పీరియన్స్​

కస్టమర్లకు బెస్ట్ ఎక్స్​పీరియన్స్​

న్యూఢిల్లీ:  షాపింగ్ మాల్స్, ఇతర ఫిజికల్ రిటైల్ లొకేషన్లు కస్టమర్లకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించగలిగితేనే వాటి బిజినెస్​లు బాగుంటాయని  ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్​ఈ ఇండియా సూచించింది.  సౌత్​ ఏషియాలో రిటైలింగ్​పై ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం..  కరోనా తగ్గడంతో భారతీయ రిటైల్ సెక్టార్​, రిటైల్ వినోద ప్రదేశాలకు గిరాకీ పెరుగుతోంది.  రిటైల్ రంగం ఈ ఏడాది జూన్​ క్వార్టర్​లో​  బలంగా పుంజుకుంది.  లావాదేవీలు సీక్వెన్షియల్​గా 100 శాతానికిపైగా పెరిగాయి. ఇదే ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇది సంవత్సరానికి 160 శాతానికిపైగా గ్రోత్​ని సాధించింది. ఆన్‌‌లైన్ షాపింగ్ బలంగా ఉన్నప్పటికీ, ఫిజికల్ రిటైలింగ్​కూ గిరాకీ బాగుండటం పెరుగుదలకు కారణం. సీబీఆర్​ఈ ఇండియా చైర్మన్​, సీఈఓ అంశుమన్​ మాట్లాడుతూ సాధారణ రిటైల్​మాల్స్​, షాప్స్​ భవిష్యత్తులో విజయవంతం కావాలంటే కస్టమర్లకు అద్భుతమైన ఎక్స్​పీరియన్స్​ ఇవ్వాలని, బిల్డింగ్స్​ బాగుండాలని కామెంట్ చేశారు.