- కుటుంబ సమస్యలే కారణం!
ఉప్పల్, వెలుగు: మూడంతస్తుల బిల్డింగ్పైనుంచి దూకి ఓ మహిళా కానిస్టేబుల్ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవిపహార్తండాకు చెందిన ప్రమీల(32) ఉప్పల్ పద్మావతికాలనీలోని అపార్ట్మెంట్ లో భర్త బాలాజీ, పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ప్రస్తుతం నాచారం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆమె సోమవారం తాను నివాసం ఉంటున్న మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది.
తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆమెను సమీప హాస్పిటల్కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం యశోధ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించారు.
