షాకింగ్.. మెట్రో రైలు డోర్ లో చీర ఇరుక్కొని మహిళ మృతి

షాకింగ్.. మెట్రో రైలు డోర్ లో చీర ఇరుక్కొని మహిళ మృతి

ఢిల్లీలోని ఇందర్‌లోక్ స్టేషన్‌లో ప్రయాణికులను ఆందోళనకు గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. మెట్రో రైలు డోర్ లో చీర ఇరుక్కోవడంతో ఓ మహిళ ట్రాక్ పై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన మహిళను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా.. డిసెంబర్ 16న ఆమె మృతి చెందింది. అయితే ఆమె మెట్రో ఎక్కిందా లేదా దిగిందా అన్న విషయం మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ సంఘటన గురువారం, డిసెంబర్ 14 న జరిగింది. ఘటన రెండు రోజుల తరువాత, శనివారం మహిళ మరణించింది. మహిళ బంధువు విక్కీ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆమె భర్త ఏడేళ్ల క్రితమే చనిపోయాడని, ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

డిసెంబర్ 14న మధ్యాహ్నం మహిళ తన కుమారుడితో కలిసి ఇందర్ లోక్ మెట్రో స్టేషన్ లో రైలు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేందుకు ప్రయత్నించింది. తన కొడుకును తీసుకురావడానికి యత్నించగా.. అప్పుడే ఆమె చీర మెట్రో తలుపులో ఇరుక్కుపోయింది. అంతలోనే మెట్రో డోర్స్ క్లోజ్ కావడం, రైలు కదలడం సెకన్లలోనే జరిగిపోయాయి. ఈ క్రమంలోనే డోర్ లో ఆ మహిళ చీర ఇరుక్కుపోయింది. రైలు అలాగే ఆమెను దాదాపు 25మీటర్ల వరకు లాక్కెళ్లింది. ఆ తర్వాత ఆమె ట్రాక్ పై పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు కాగా.. ఆమె కొడుకు అక్కడే ప్లాట్ ఫారమ్ పై ఉండిపోయాడు.