ఇటీవల వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయాయి. పెళ్లైన తరువాత వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. వివాహేతర బంధాల మోజులో పడి జీవిత భాగస్వాములను చంపుకుంటున్నారు. అనంతరం రోడ్డుపాలు అవుతున్నారు. ఇలాంటి తరహా కేసులు ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వివాహిత ఒకే గదిలో ఇద్దరు మగవారితో అభ్యంతర స్థితిలో ఉండగా షడన్గా ఎంట్రీ ఇచ్చింది అత్త. కోడలు అలా చేయడం చూసి కోపోద్రిక్తురాలై గదికి తాళంవేసి పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకొని చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్గంజ్ జిల్లా నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే యువకుడికి పక్క గ్రామంకు చెందిన యువతితో వివాహం అయింది. విళ్లి అయిన కొద్దిరోజులకు సదరు వ్యక్తి ఉపాధికోసం సౌదీ అరేబీయా వెళ్లాడు. భర్త విదేశాలకు వెళ్లడంతో.. భార్య పక్కగ్రామంలోని తన పుట్టింటికి వెళ్లి వస్తుండేది. కొద్దికాలానికి పుట్టింటి వద్ద తనకు బంధువులైన ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. తన పుట్టింటికి వెళ్లినప్పుడల్లా వారిద్దరిని కలిసి వస్తుండేది.ఇలా వివాహేతర సంబంధం వ్యవహారం గుట్టుచప్పుడుగా కొంత కాలం సాగించింది.
మెట్టినింటికి వచ్చిన తర్వాత కొద్దిరోజులకు వారిద్దరిని నేరుగా ఇంటికి పిలవడం మొదలు పెట్టింది. అత్తామామలకు బంధువులేనని, తమ అమ్మవారి తరపు వారని చెప్పేది. పలుసార్లు వాళ్లు ఇంటికి వచ్చిపోతుండటంతో అత్తకు అనుమానం వచ్చింది. ఓ రోజు ఇద్దరు వ్యక్తులు ఇంటికిరాగా.. తన కోడలు, ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉన్నారు. రూంలో వారు ఏం చేస్తున్నారో చూసేందుకు అత్తవెళ్లగా.. తన కోడలు ఆ ఇద్దరు వ్యక్తులతో అసభ్యకర రీతిలో లీనమైపోగా… కోడలు చేసే పనిని కన్నంలో నుంచి చూసి కంగుతింది. ఎలాగైనా రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవాలని భావించింది. కొడుకుకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే తాళం తెచ్చి రూం తలుపుకు వేసింది. వెంటనే ఫోన్ అందుకుని 112 నెంబర్కు డయల్ చేసి పోలీసులకు విషయం చెప్పంది. పోలీసులు అక్కడికి చేరుకొని వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. మహిళ తన కోడలుపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసులు వెళ్లి చూడగా.. కోడలు ఇద్దరు వ్యక్తులతో అభ్యంతరకర స్థితిలో ఉందని, దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం హైటెక్ యుగంలో క్షణకావేశంలో చేసే తప్పుడు పనులు వారి భవిష్యత్తుకు చరమగీతం పాడుతున్నాయి. ఎవరికి తెలియదులే అని గుట్టు చప్పుడు కాకుండా చేసే పనులు వారికి చేటు తెస్తాయి. నిజం అనేది ఏదో ఒక రూపంలో బయటపడక మానదు. ఇలాంటి ఘటనలు అటు పుట్టింటివారికి.. ఇటు అత్తింటి వారికి చేటు తేవడమే కాకుండా .. వారికి కూడా మాయలేని మచ్చగా ఏర్పడి జీవితం అంధకారమవుతుందని గుర్తించాలి.