ఆస్పత్రిలో కన్నుమూసి..అంత్యక్రియల్లో కళ్లు తెరిచింది

ఆస్పత్రిలో కన్నుమూసి..అంత్యక్రియల్లో కళ్లు తెరిచింది

డెట్రాయిట్‌‌‌‌‌‌‌‌(అమెరికా): డాక్టర్లు చనిపోయిందని చెప్పిన 20 ఏండ్ల అమ్మాయి ఫ్యూనరల్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో కళ్లు తెరిచింది. దీనిని గమనించిన మార్చురీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ వెంటనే ఆమెను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. టైమ్‌‌‌‌‌‌‌‌షా బ్యుచాంప్‌‌‌‌‌‌‌‌కదలలేని స్థితిలో, ఊపిరి కూడా తీసుకోకుండా తన ఇంటిలో పడి ఉంది. సీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరియు ఇతర టెక్నిక్స్‌‌‌‌‌‌‌‌తో ఆమెను బ్రతికించేందుకు పారా మెడిక్స్ ‌‌‌‌‌‌‌‌ప్రయత్నించారు. అరగంటపాటు ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. లోకల్ ‌‌‌‌‌‌‌ఆసుపత్రిలోని ఎమర్జెన్సీకి తరలించి టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన డాక్టర్లు ఆమె చనిపోయిందని డిక్లేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

దీంతో ఆమె పేరెంట్స్ ఫ్యూనెరల్ హౌస్ కు తీసుకెళ్లారు. అంత్యక్రియలు చేసేందుకు కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసిన స్టాఫ్‌‌‌‌‌‌‌‌ ఆమె కళ్లుతెరిచి ఉండడం చూసి పారామెడిక్స్‌‌‌‌‌‌‌‌కు ఇన్ఫామ్ చేశారు. వారు వచ్చి టైమ్‌‌‌‌‌‌‌‌షాను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నా.. కూతురు బ్రతకకపోవచ్చని ఆమె తల్లిభయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం