
జడ్చర్ల, వెలుగు: మూడ్రోజులుగా నీళ్లు రాకపోవడంతో తిప్పలు పడుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని శుక్రవారం జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామపంచాయతీ ఆఫీస్ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్చేశారు. గ్రా మంలోని బోర్ చెడిపోయి వారం రోజులు గడిచినా రిపేర్ చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. బండమీదిపల్లి శివారులో పైప్లైన్ పగిలిపోవడంతో ఈ సమస్య వచ్చిందని, సమస్య పరిష్కరిస్తామని పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనారాయణ తెలిపారు.