నీటి ఎద్దడిపై ఖాళీ బిందెలతో నిరసన

నీటి ఎద్దడిపై ఖాళీ బిందెలతో నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టణంలో నీటి ఎద్దడిని నివారించాలని డిమాండ్​ చేస్తూ  మహిళలు బుధవారం పోస్టాఫీస్ సెంటర్ లోని అంబేద్కర్​ విగ్రహం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ మున్సిపల్ ఫ్లోర్​ లీడర్ శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ వారం, పది రోజులుగా నీళ్లు రాకున్నా అధికారులు  పట్టించుకోవడం లేదన్నారు.

ట్యాంకర్లు అరకొరగా వస్తుండడంతో నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  సింగరేణి వాటర్​ రాని ప్రాంతాల్లో ప్రజలు   నీళ్లను కొనుక్కునే పరిస్థితి నెలకొందన్నారు.  ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్​, మున్సిపల్​ చైర్మన్​కు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టకపోతే మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరసనలో కౌన్సిలర్లు, నాయకులు బోయిన విజయ్​ కుమార్, సమైఖ్య, భవానీ, విజయ, పాల్గొన్నారు.