ఉమ్మడి వరంగల్ లో పనుల జాతర షురూ..

ఉమ్మడి వరంగల్ లో  పనుల జాతర షురూ..

వెలుగు, నెట్​వర్క్​ : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమం శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గంగారంలో 814 మందికి కొత్త రేషన్​ కార్డులను పంపిణీ చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. 

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో కలెక్టర్​ దివాకర అడిషనల్​ కలెక్టర్​ సంపత్​రావు, జయశంకర్​భూపాలపల్లి జిల్లా చిట్యాల, టేకుమట్ల మండలాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కలెక్టర్​ రాహుల్​శర్మతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి, కడారిగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్​ సత్యశారద, గీసుగొండ మండలం గట్టకిందిపల్లి, రాంపురం, మరియపురం, సంగెం మండలం ఎల్లూరి రంగంపేట, ముమ్మడివరం, కాట్రపల్లి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి, కలెక్టర్​ సత్యశారద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జనగామ జిల్లా శామీర్​పేటలో వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​ బనుక శివరాజ్​యాదవ్, ​ఎంపీడీవో సంపత్​కుమార్, తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించారు. 

అదేవిధంగా శివరాజ్​యాదవ్​ బొమ్మకూరు రిజర్వాయర్​ ద్వారా జనగామ మండలంలోని చెరువులన్నింటికీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలంలో ఎంపీడీవో రాజు, ఏపీవో రాజు పనుల జాతర కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.