ఏండ్లుగా కార్మికుల పెన్షన్ ​పెంచుతలేరు

ఏండ్లుగా కార్మికుల పెన్షన్ ​పెంచుతలేరు
  •     ‘చలో సింగరేణి హెడ్డాఫీస్’ను సక్సెస్ చేయాలె
  •     రిటైర్డ్ కార్మికుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య పిలుపు

కోల్​బెల్ట్, వెలుగు : రిటైర్డ్​కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​వద్ద తలపెట్టిన ధర్నాను సక్సెస్ చేయాలని రిటైర్డ్​కార్మికుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాలలోని రాముని చెరువు కట్ట పోచమ్మ ఆలయ ఆవరణలో రిటైర్డ్​కార్మికులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ఏండ్లుగా కార్మికుల పెన్షన్​పెంచడం లేదన్నారు. మూడేండ్లకోసారి రివైజ్​చేసి పెన్షన్​ను పెంచాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు

యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. 1998లో పెన్షన్​స్కీం అమలులోకి రాగా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా రివైజ్​ చేయలేదన్నారు. అధికారులతో సమానంగా ఫండ్​ను రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్​ చేశారు. సింగరేణి హాస్పిటళ్లలో రిటైర్డు కార్మికుల నుంచి ఎలాంటి వైద్య ఖర్చులు రికవరీ చేయొద్దన్నారు. రూ.20లక్షల గ్రాట్యుటీని జులై 1,2016 నుంచి అమలు చేయాలని, రిటైర్డ్​కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ

‘చలో సింగరేణి హెడ్డాఫీస్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్ట్​కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, మాజీ సింగరేణి సీజీఎం చంద్రునాయక్​, నాయకులు కృష్ణ, శశాంక్​రావు, విజ్ఞేశ్ , ఒడ్నాల శ్యాంసుందర్, పి.రాంరెడ్డి, రాజేశం, చిప్ప రామస్వామి, చుంచు శంకరయ్య పాల్గొన్నారు.