ఫైనల్లో జెస్విన్‌‌‌‌‌‌‌‌ ..శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌, అన్నురాణికి నిరాశ

ఫైనల్లో జెస్విన్‌‌‌‌‌‌‌‌ ..శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌, అన్నురాణికి నిరాశ

బుడాపెస్ట్: వరల్డ్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో  ఇండియా అథ్లెట్‌‌‌‌‌‌‌‌ జెస్విన్‌‌‌‌‌‌‌‌ అల్డ్రిన్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ లాంగ్‌‌‌‌‌‌‌‌జంప్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. మరో స్టార్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్‌‌‌‌‌‌‌‌ మురళీ శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌ మాత్రం క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టాడు.  మార్చిలో 8.42 మీటర్లతో నేషనల్‌‌‌‌‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసిన అల్డ్రిన్‌‌‌‌‌‌‌‌ మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో 8 మీటర్ల దూరం దూకాడు. 

గ్రూప్‌‌‌‌‌‌‌‌లో ఆరో,  ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 12వ స్థానంతో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించాడు. మరోవైపు గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో పోటీ పడ్డ  శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌ 7.74 మీటర్లతో 12వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 22వ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో క్వాలిఫయింగ్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే వెనుదిరిగాడు. గురువారం 12 మంది పోటీ పడే ఫైనల్లో జెస్విన్‌‌‌‌‌‌‌‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరోవైపు విమెన్స్​  జావెలిన్​ త్రోలో అన్ను రాణి ఫైనల్​ చేరలేకపోయింది.