
విక్టరీ వెంకటేష్(Venkatesh హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’(Saindhav). శైలేష్ కొలను( Sailesh Kolanu) దర్శకత్వంలో ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అరే నీ బాధలలోనే..నువ్వు తాగుతున్నావు రా.. రేయ్ నీ ఏడ్పులలోనే తాగుతున్నావు రా..తాగి ఖుషినే డబల్ చేస్తావా..లేక బాధనే డబల్ చేస్తావా.. అంటూ సాగే ఈ పాట చాలా హమ్మింగ్ గా ఉంది. రాంగ్ యూసేజ్ అంటూ..వెంకీ మామా వేసే స్టెప్స్తో పాటు..ఆ పాటలోని లిరిక్స్కు ఇచ్చే హమ్మింగ్స్ మరింత జోష్ పెంచుతుంది.
ఈ పాటకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించగా..నకాష్ అజీజ్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రపీ అందించారు. ఫోన్, మద్యాన్ని..ఇలాంటి వాటిని తప్పు పద్ధతిలో ఉపయోగించకు అంటూ..చంద్రబోస్ చాలా సింపుల్గా చెప్పేశారు. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ గీతం బార్ లలో..ఊర్లలో సరదాగా తాగి చిల్ అయ్యే టైంలో పాడుకునేలా స్వరపరిచారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ భారీ అంచనాలు పెంచేసింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో పాటలా నగరా మోగించడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
హై-ఆక్టేన్ యాక్షన్గా రూపొందుతోన్న ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.