
న్యూఢిల్లీ: అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం 2,355 ఖాతాలను నిషేధించాలని ఆదేశించిందని, ఇందులో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఖాతా కూడా ఉందని వెల్లడించింది.
ఈ ఆదేశాలు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని జారీ అయ్యాయని సమాచారం. బ్యాన్ చేసిన ఖాతాలలో రాయిటర్స్ ప్రధాన ఖాతాతో పాటు, కొందరు ప్రముఖులు, ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థల ఖాతాలు కూడా ఉన్నాయి.
కేంద్రం మాత్రం ఎక్స్ ప్రకటనను తోసిపుచ్చింది. తాము కొత్తగా ఖాతాల బ్లాకింగ్కు ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. రాయిటర్స్ ఖాతాను పునరుద్ధరించాలని ఎక్స్ను కోరామని పేర్కొంది.