సీఎంఆర్ కంప్లీట్ చేయండి: యాదాద్రి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి

సీఎంఆర్ కంప్లీట్ చేయండి: యాదాద్రి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి

యాదాద్రి, వెలుగు: డెడ్​లైన్​ లోగా సీఎంఆర్​ కంప్లీట్​ చేయాలని అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి ఆదేశించారు. తన ఆఫీసులో మిల్లర్లతో మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 2024–-25 వానాకాలం సీజన్​కు సంబంధించిన సీఎంఆర్​ను ఇప్పటి వరకు 83 శాతం మాత్రమే అందించిన విషయాన్ని గుర్తు చేశారు.  మిగిలిన సీఎంఆర్ ​నవంబర్​12లోగా అందించాలని సూచించారు.  బ్యాంక్​ గ్యారంటీ చెల్లించిన మిల్లులకే 2025-–26 వానాకాలం సీజన్​ వడ్లను సీఎంఆర్​కు ఇస్తామని తెలిపారు. 

బ్యాంక్​ గ్యారంటీ చెల్లించకుండా, వడ్లను తీసుకోని మిల్లుల అనుమతులు రద్దు చేస్తామని  ఆయన  హెచ్చరించారు.  మీటింగ్‌లో  సివిల్​సప్లయ్​ డీఎం హరికృష్ణ, డీసీఎస్​వో రోజా రాణి, రైస్​ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మార్త వెంకటేశం, పసుపునూరి నాగభూషణం, మనోహర్​ సహా మిల్లర్లు ఉన్నారు.