నేషనల్ సైన్స్​ కాంగ్రెస్​కు యాదాద్రి స్టూడెంట్

నేషనల్ సైన్స్​ కాంగ్రెస్​కు యాదాద్రి స్టూడెంట్

యాదాద్రి, వెలుగు: నేషనల్ సైన్స్​ కాంగ్రెస్​కు యాదాద్రి స్టూడెంట్​ భూక్యా సలోని ఎంపికయ్యారు. హైదరాబాద్​లో జరిగిన జాతీయ బాలల సైన్స్​ కాంగ్రెస్​ స్టేట్​ లెవల్​ పోటీలకు తుర్కపల్లి మండలం ముల్కలపల్లి హైస్కూల్​ స్టూడెంట్​ సలోని హాజరయ్యారు. తాను రూపొందించిన ‘వాడిపడేసిన సిగరెట్ పీకతో కాలుష్యం పీక నొక్కుదాం’ ప్రాజెక్ట్​ ప్రదర్శించారు.

ఈ ప్రాజెక్ట్​ను ఆసక్తిగా గమనించిన పరిశీలకులు జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. స్టూడెంట్​ సలోనిని తెలంగాణ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ మారుపాక నగేశ్, విద్యాశాఖ జేడీ మదన్మోహన్, కలెక్టర్​ హనుమంతు జెండగే, అడిషనల్​ కలెక్టర్​ జీ వీరారెడ్డి, డీఈవో నారాయణ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి భరణి కుమార్, టీచర్​ కల్యాణి అభినందించారు.