
ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 09న ఆదివారం రోజున గుజరాత్ టైటాన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. చివరి ఓవర్లో మొత్తం మ్యాచ్ రూపు రేఖలు మారిపోయాయి. అల్మోస్ట్ గుజరాత్ విజయం ఖాయం అనుకున్న టైమ్ లో కేకేఆర్ ఆటగాడు రింకు సింగ్ చేసిన విధ్వంసం మాముల్ది కాదు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు అవసరం అనుకున్న క్రమంలో బ్యాటింగ్ లో ఉన్న రింకు సింగ్ చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ వేసిన ఈ ఓవర్లో రింకు సింగ్ వరుసగా సిక్సర్లు బాదాడు. మ్యాచ్ ఓడిపోవడంతో యశ్ దయాల్ తీవ్ర నిరాశకు గురయ్యాడని అతని తండ్రి చంద్రపాల్ దయాల్ తెలిపాడు. కొడుకును అలా చూసి అతని తల్లి రాధా దయాళ్ ఆహారం తినడం మానేసిందని తెలిపాడు. అయితే క్రికెట్ లో ఇవ్వన్ని కామన్ అని తాను వారికి దైర్యం చెప్పినట్లుగా యశ్ దయాల్ తండ్రి వెల్లడించాడు. యశ్ బౌలింగ్ శైలితో రింకుకు ఉన్న పరిచయం కూడా ప్రతికూలంగా మారిందని చంద్రపాల్ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ఆ రోజు యశ్ ది కాదని చంద్రపాల్ తెలిపాడు.