ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీ చేస్తున్నాయి: మల్లాది విష్ణు

ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీ చేస్తున్నాయి: మల్లాది విష్ణు

టీడీపీ అధినేత చంద్రబాబు  ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.  ఏపీలో పొత్తులు తేలాక ఎవరి పై ఎవరు రాళ్లు విసురుతారో.. ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుంది. పొత్తులు ప్రకటించాక మంచి వినోదం మొదలవుతుంది. ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. చంద్రబాబు,పవన్ ది రెండు నాల్కల ధోరణి. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ ఏం మాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారని మల్లాది విష్ణు  అన్నారు.

 విధ్వంసం పుస్తకం పేరుతో ప్రజలకు మళ్లీ అబద్దాలు చెబుతున్నారని  టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు… వైసీపీ ఐదేళ్లపాలనకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారంటూ... చంద్రబాబు  తన గురించి తాను రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబు... సీఎం జగన్‌పై తప్పుగా ప్రచారం చేయిస్తున్నారంటూ... . బాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకం వేసింది సీపీఐ కాదా?.సీఎం జగన్‌ని ఢీకొట్టే సత్తాలేక బాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడు. కుర్చీ కోసం పాకులాడటం తప్ప.. ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన మీకులేదు. ఐదేళ్లలో విజయవాడ నగరానికి ఒక్క మంచి పనైనా చేశావా?. విజయవాడ అభివృద్ధి పై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని  మల్లాది విష్ణు అన్నారు.  

చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆరు గ్యారంటీలిస్తానంటున్నావు.. ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారని తెలిపారు. బాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకం వేసింది సీపీఐ కాదా అని అన్నారు. కాగా.. జగన్ మోహన్ రెడ్డి పై బురద జల్లడానికే విధ్వంసం పుస్తకాన్ని తెచ్చారని విష్ణు మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టే సత్తాలేక.. బాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడని విమర్శించారు.