విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి:విజయసాయిరెడ్డి

 విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి:విజయసాయిరెడ్డి
  • సీబీఐ కోర్టును కోరిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని ఆయన పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టు అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లివస్తానని విజయ సాయిరెడ్డి తెలిపారు. విదేశాలకు వెళ్లేందుకు కనీసం రెండు వారాల అనుమతివ్వాలని ఆయన కోరారు. కాగా విజయసాయిరెడ్డి పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. దీంతో విజయసాయిరెడ్డి పిటిషన్ పై విచారణ ఈనెల 16కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.