అవినీతికి బ్రాండ్​ అంబాసిడర్​గా మారిన్రు : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

అవినీతికి బ్రాండ్​ అంబాసిడర్​గా మారిన్రు : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

హన్వాడ, వెలుగు : పాలమూరు అభివృద్ధి జరిగిందని చెబుతున్న బీఆర్ఎస్​ లీడర్లు, అవినీతికి బ్రాండ్​ అంబాసిడర్లుగా మారారని మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్​రెడ్డి (వైఎస్ఆర్) ఫైర్​ అయ్యారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం హన్వాడ మండలం కొనగట్టుపల్లి, యారోనిపల్లి, మాదారం, నాగంబాయితండాల్లో పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తిలకం దిద్ది, హారతులు పట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ప్రజల ఓట్ల ద్వారా పదవి పొందిన విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. భయం గుప్పిట్లో ఇప్పుడు పాలమూరు బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. మోసపూరిత వాగ్ధానాలతో పదవులు చేపట్టడం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సవాల్​ విసిరారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్​ పార్టీ పక్కాగా అమలు చేస్తుందని, తనను ఆశీర్వదించి ఓట్లు వేసి గెలపించాలని కోరారు. లీడర్లు ఎన్పీ వెంకటేశ్, మారేపల్లి సురేందర్ రెడ్డి, టంకర కృష్ణయ్య యాదవ్, ఆనంద్ రెడ్డి, మాదారం బాల్ రెడ్డి పాల్గొన్నారు.