యెస్ బ్యాంక్ లాభం రూ.231 కోట్లు

యెస్ బ్యాంక్ లాభం రూ.231 కోట్లు

న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్  నికర లాభం డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ3) లో  రూ.231 కోట్లకు పెరిగింది. 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22–23 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన  రూ. 52 కోట్లతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. మొండిబాకీలను అసెట్ రికన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీలకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేయడంతో బ్యాంక్ ప్రొవిజన్లు తగ్గాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 225 కోట్ల నికర లాభాన్ని యెస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది.

క్యూ3 లో బ్యాంక్‌‌‌‌‌‌‌‌ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 2.3 శాతం పెరిగి రూ.1,971 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం రూ. 12.1 శాతం పెరిగి రూ. 1,195 కోట్లకు చేరుకున్నాయి. యెస్ బ్యాంక్ గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ రేషియో 2 శాతం దగ్గర నిలకడగా ఉంది. బ్యాంక్ ప్రొవిజన్లు క్యూ3 లో రూ.555 కోట్లుగా ఉన్నాయి. 2022–23 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ రూ.845 కోట్లుగా రికార్డయ్యింది.