అయోధ్య: దీపావళికి అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం రెడీ అయ్యింది. బుధవారం సరయు తీరంలోని రామ్కీ పైడి ఘాట్లో 9 లక్షల దీపాలను వెలిగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది 6 లక్షల దీపాలతో ఉన్న రికార్డును అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అయోధ్య పట్టణం మొత్తం దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశామని ఆ జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ చెప్పారు. రామ మందిరంతోపాటు పట్టణంలోని ఇతర ప్రదేశాల ఇతివృత్తాలతో టేబులాక్స్తో కవాతు నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. కాగా, దీపోత్సవంలో భాగంగా అయోధ్యలో రామాయణంపై చేసిన శాండ్ఆర్ట్లు, డ్యాన్సుల ఫొటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
Ayodhya | The fifth edition of the Deepotsav to feature tableaux based on the Hindu epic Ramayana, sand art and dancers pic.twitter.com/OlPX5KKjvk
— ANI UP (@ANINewsUP) November 3, 2021