స్మార్ట్ ఫోన్ వాడకంతో నష్టాలెంటో తెలిస్తే.. మళ్లీ ఫోన్ ముట్టరు

స్మార్ట్ ఫోన్ వాడకంతో నష్టాలెంటో తెలిస్తే.. మళ్లీ ఫోన్ ముట్టరు

ఫోన్​ వదిలేసి.. జీవితాన్ని పట్టుకోండి

ఒకప్పుడు టెన్త్ క్లాస్​ చదివే పిల్లాడికే పెద్దయ్యాక ఏమవ్వాలనే ఆలోచన ఉండేది. డిగ్రీకి వచ్చాక ‘కచ్చితంగా ఈ ఉద్యోగం సంపాదించాలి. జీవితంలో సెటిలవ్వాలి’ అనే క్లారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు.. స్కూల్​ పిల్లాడి నుంచి జాబ్​ ట్రయల్స్​లో ఉన్న కుర్రాడి వరకు అందరూ స్మార్ట్​ ఫోన్లలో బిజీ అయిపోయారు. రోజులో ఏడెనిమిది గంటలు వీడియో గేమ్స్​, సోషల్ మీడియాలో గడుపుతున్నారు. దాంతో ఈ జనరేషన్​కు లైఫ్​ మీద సీరియస్​నెస్​ తగ్గిపోయింది. ఒక లక్ష్యం లేకుండా గడిపేస్తున్నారని వాపోతున్నాడు ఇండియన్​ ఫేమస్​ రైటర్​ చేతన్​ భగత్​. ​ఈ జనరేషన్​ 4జీ ఫోన్లతో అందమైన జీవితాలను ఎలా నాశనం చేసుకుంటోంది అనే విషయంపై ఒక ఓపెన్​ లెటర్​ రాశాడు.

చేతన్​ భగత్​ రాసిన ఫిక్షన్​​, నాన్​ ఫిక్షన్​ నవలల్లో ఎక్కువగా యూత్​కి సంబంధించిన అంశాలే ఉంటాయి. అలాగే 2010లో టైమ్​ మ్యాగజైన్​ విడుదల చేసిన ‘100 మోస్ట్​ ఇన్​ఫ్లుయెన్షియల్​ పీపుల్’ లిస్ట్​లో చేతన్​ భగత్​ ఉన్నాడు. ఎప్పుడూ తన నాన్​ ఫిక్షన్​​ నవలల్లో, పలు ఇంగ్లీష్​, హిందీ పేపర్లలో రాసే కాలమ్స్​లో కూడా యువతను మోటివేట్ చేసే టాపిక్స్​ ఎంచుకుంటాడు. అలా ఇప్పుడు కూడా యువత స్మార్ట్​ ఫోన్లలో పడి తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటోందని ఆ లెటర్​లో చెప్పాడు. ఆ ఓపెన్​ లెటర్​ని ‘డియర్​ ఫ్రెండ్స్…’ అంటూ మొదలుపెట్టి ‘లవ్​’ అని ముగించాడు. ఆ లెటర్​ సారాంశం ఇది…

స్క్రీన్​ టైమ్​ తగ్గించుకుంటేనే..

ఇప్పటి జనరేషన్​ పూర్తిగా ఫోన్లు, వీడియోలు, వీడియో గేమ్స్​ ఆడటం, ఫ్రెండ్స్​తో చాటింగ్​, సోషల్​ మీడియాలో కామెంట్లు పెట్టడం, సెలబ్రిటీల పోస్ట్​లను షేర్​ చేయడం వంటి పనుల్లో పూర్తిగా మునిగిపోయారు. అంతేతప్ప, తమ జీవితం గురించి ఆలోచించడానికి టైం కేటాయించట్లేదు. స్మార్ట్​ఫోన్లు, తక్కువ ధరకు ఇంటర్నెట్​ వాడుతున్న మొదటి జనరేషన్​ అయ్యుండి.. దాన్ని ఏవిధంగానూ మంచి పనికి ఉపయోగించట్లేదు. రిటైరై ఇంట్లో ఉంటున్నవాళ్లు, బిజినెస్​లో సెటిలైనవాళ్లు గంటల తరబడి ఆన్​లైన్​లో స్పెండ్​ చేస్తే వచ్చే నష్టం ఉండదు. కానీ లైఫ్​ని అందంగా, గొప్పగా తీర్చిదిద్దుకోవాల్సిన యువత ఇలా ఫోన్లు పట్టుకోవడం ఏమాత్రం కరెక్ట్​ కాదు.

4జీ జనరేషన్.. ఫర్​గెటెన్​ జనరేషన్​ అవ్వొచ్చు

స్మార్ట్​ ఫోన్లలో రోజుకు ఐదు గంటలు గడుపుతున్నారంటే.. జీవితంలోని మూడొంతుల్లో ఒకవంతును వేస్ట్​ చేస్తున్నట్లే. అంతేకాదు సిగరెట్స్, డ్రగ్స్​లాగే ఈ ఫోన్​ అడిక్షన్​ కూడా జీవితాన్ని నాశనం చేస్తుంది. పనికి రాని ఆలోచనలతో మెదడు పూర్తిగా నిండిపోయి, కెరీర్​ని బిల్డ్​ చేసే అంశాలు దూరమవుతాయి. ఇలాంటి పరిస్థితే ఇంకా కొనసాగితే ఫోర్​ జీ జనరేషన్​ కాస్త ఫర్​గెటెన్​ జనరేషన్ (ప్రపంచం మొత్తం మర్చిపోయే తరంగా)​గా మారుతుంది.

మార్పు మనలోనే రావాలి

ఈ మధ్య సోషల్ మీడియాలో యువత అనవసరమైన విషయాలపై ఎక్కువ ఫోకస్డ్​గా ఉంటోంది. ‘ఆ పొలిటీషియన్​ తీరు బాలేదు.. ఈ పార్టీ వాళ్లది తప్పు’, ‘నెపోటిజం వల్లే ఆ యాక్టర్ చనిపోయాడు.. ఇండస్ట్రీలో నెపోటిజం తగ్గేదాకా ఆన్​లైన్​ క్యాంపెయిన్లు చేస్తాం’, వంటి అంశాల మీద కామెంట్లు పెడుతూ అదే జీవితం అనుకుంటున్నారు. వీటిపై పెడుతున్న అనాలిసిస్​ టాలెంట్, టైం​ని చదువు లేదా ఫ్యూచర్​ గోల్స్​ మీద పెడితే కచ్చితంగా జీవితంలో సక్సెస్​ వస్తుంది. అంతేతప్ప ఏ ఒక్క పొలిటీషియన్, ఏ బాలీవుడ్​ సెలబ్రిటీ మనల్ని చేయిపట్టుకుని నడిపించరు. ఎదుటివాళ్లను తప్పుబట్టడం ఆపేయాలి. క్రియేటివ్​గా ఆలోచించడం మొదలుపెట్టాలి. 4జీ ఫోన్లు కూడా డ్రగ్స్​ లాంటివే. కాకపోతే ఇవి లీగల్​. అంతమాత్రాన వాటిని డ్రగ్స్​లాగా మనసుకు అలవాటు చేసుకోవద్దు. వాటిని కేవలం సమాచారం, షాపింగ్​, ఆన్​లైన్​ క్లాసుల కోసం ఉపయోగించుకోవడం మంచిది. అలా అవసరమైన వాటికి మాత్రమే స్మార్ట్​ ఫోన్​ని వాడుతూ, ఫ్యూచర్​ కోసం ఎక్కువ టైమ్​, స్కిల్స్​ని వాడితే సొసైటీలో మీరే సక్సెస్​ఫుల్ పర్సన్​  అవుతారు. ఇలా సాగింది చేతన్​ భగత్ ఓపెన్​ లెటర్​

ఫోన్ అలవాటుతో నష్టాలు

ఫోన్​కి అలవాటు పడటం పూర్తిగా టైం​ వేస్ట్​ పని. ఆ టైం​ని ప్రొడక్టివ్ పనుల కోసం ఉపయోగించాలి. ఉదాహరణకు ఫోన్​ని పక్కనబెట్టి మూడు గంటలపాటు ఫిట్​నెస్​, అకడమిక్ బుక్స్​ లేదా మోటివేషనల్​ బుక్స్​ చదవడం, కొత్త స్కిల్​ని నేర్చుకోవడం, కోరుకున్న జాబ్​ కోసం ట్రయల్స్​, చిన్న బిజినెస్​ స్టార్ట్ చేయడం వంటి పనులకు కేటాయిస్తే, జీవితంలో మార్పు మొదలవుతుంది. అలాకాకుండా ఏ పూటకు ఆ పూట గడిపితే భవిష్యత్​ శూన్యంగా మిగులుతుంది.

మన బ్రెయిన్​లో రెండు భాగాలుంటాయి. ఒకటి కాగ్నిటివ్​, మరొకటి ఎమోషనల్​. మెదడు పనితీరు బాగుండాలంటే ఆ రెండూ యాక్టివ్​గా ఉండాలి. అయితే ఏవిధంగానూ పనికి రాని స్టఫ్​ను చూడటం వల్ల కాగ్నిటివ్​

బ్రెయిన్​ మొద్దుబారుతుంది. సోషల్​ మీడియాలో ఎక్కువగా ఎంటర్​టైనింగ్​ కంటెంట్​ చూడటంతో ఎమోషనల్​ బ్రెయిన్​ మాత్రమే పని చేస్తుంది. దానివల్ల లాజికల్​గా ఆలోచించే తత్వం కోల్పోతారు. ఒక అంశాన్ని పలురకాలుగా అనలైజ్​ చేయలేక తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ.

గంటల తరబడి స్క్రీన్​ని చూడటం వల్ల  మోటివేషన్​, ఎనర్జీని పూర్తిగా కోల్పోతారు. అసలు జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దాన్ని చేరుకోవడానికి  మోటివేషన్​, వర్కింగ్​ అవర్స్​ పెంచుకోవడం ముఖ్యం. కానీ ఇలా స్క్రీన్​ ముందు కూర్చోవడం అలవాటైతే బద్ధకం వచ్చేస్తుంది. ఓడిపోతామన్న భయం వెంటాడుతుంది. అందువల్ల మొదలుపెట్టిన ఏ పనినీ పూర్తి చేయలేరు.

For More News..

పోలీస్‌‌ కంట్రోల్‌‌లో సిద్దిపేట, దుబ్బాక

చంద్రునిపై మస్తు నీళ్లు.. తేల్చిన నాసా..

దసరాకు నిమిషానికి రూ. 1.5 కోట్ల స్మార్ట్‌‌ఫోన్లు కొన్నరు