మంచిర్యాల జిల్లా: పోలీస్ స్టేషన్ లోనే ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన మంచిర్యాల టౌన్ లో కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో ఆ యువకుడు (మల్యాల సాగర్) తనను వేధిస్తున్నాడని మైనర్ బాలిక పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేయడంతో భయపడ్డ సాగర్ స్టేషన్లో కిరోసిన్ పొసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటనలో అతనికి గాయాలవడంతో.. పోలీసులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తననే పెండ్లి చేసుకోవాలని వేధించి.. తిరిగి తన పైనే ఆ బాలిక కేసు పెట్టిందని యువకుడు సాగర్ చెబుతున్నాడు. ఫిర్యాదు చేసిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నానని తెలుపగా… పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.