భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కిన యువకుడు

భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కిన యువకుడు

కొల్చారం, వెలుగు: భార్య కాపురానికి రాలేదని ఓ యువకుడు కరెంట్​టవర్​ ఎక్కాడు. ఈ సంఘటన శనివారం మండల కేంద్రమైన కొల్చారంలో చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లి తండాకు  చెందిన దేవి సింగ్ తన భార్య శిరీష కాపురానికి రావడం లేదని గత ఏడాది నవంబర్ లో పోలీస్ స్టేషన్ ముందున్న టవర్​ ఎక్కాడు.

అయినా ఆమె తన మాట వినడం లేదని మరోమారు పోలీస్​స్టేషన్​ ముందున్న ఎలక్ట్రిక్​ టవర్ ఎక్కడని కుటుంబీకులు తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని పోలీసుల హామీ ఇవ్వడంతో దేవీసింగ్​ టవర్ పై నుంచి దిగాడు. కాగా ఇదే విషయంలో గత నవంబర్ లో ఇక్కడే టవర్ ఎక్కాడు.