స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి

స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి

నాగర్ కర్నూల్: కొల్లాపూర్  స్వతంత్ర అభ్యర్థి శిరీష(బర్రెలక్క) తమ్ముడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మంగళవారం(నవంబర్ 21) న కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క(శిరీష) తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహింస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు.తన తమ్ముడిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని బర్రెలక్క తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు ప్రజల మద్దతు పెరగడంతో ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలా దాడులు చేయించడం అప్రజాస్వామికం అని అన్నారు. మీడియాలో మాట్లాడుతూ శిరీష(బర్రెలక్క) బోరున విలపించారు. 

నిరుద్యోగులకు న్యాయం జరగాలని తాము పోరాతున్నామని.. యువత, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆమె కోరారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదని.. నిరుద్యోగ యువత కోసం పోరాడుతామని కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష( బర్రెలక్క) తెలిపారు.