ఇందారం చౌరస్తాకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలి : తోకల సురేశ్

ఇందారం చౌరస్తాకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలి : తోకల సురేశ్

కోల్​బెల్ట్, వెలుగు: జైపూర్​మండలం ఇందారం చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహం ఏర్పాటు చేసి, చౌరస్తాకు ఆయన పేరు పెట్టాలని యూత్​ కాంగ్రెస్​ జిల్లా సెక్రటరీ తోకల సురేశ్​ కోరారు. సోమవారం కలెక్టర్​ కుమార్​ దీపక్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర మంత్రిగా కాకా వెంకటస్వామి సింగరేణి అభివృద్ధికి ఎంతో కృషి చేశార న్నారు. సంస్థ నష్టాల్లోకి వెళ్తే ఎన్టీపీసీ నుంచి లోన్​ ఇప్పించి లాభాల్లోకి వచ్చేలా చొరవచూపి లక్ష మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారన్నారు.

 కార్మికులకు పెన్షన్​ స్కీమ్ తీసుకొచ్చిన గొప్ప నేత అన్నారు. సింగరేణి ప్రాంతం, కార్మికులతో కాకాకు విడదీయలేని  అనుబంధం ఉందని అందుకే మంచిర్యాల జిల్లా ముఖద్వారం అయిన ఇందారం చౌరస్తాకు కాకా పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.