
కోల్బెల్ట్, వెలుగు: జైపూర్మండలం ఇందారం చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహం ఏర్పాటు చేసి, చౌరస్తాకు ఆయన పేరు పెట్టాలని యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ తోకల సురేశ్ కోరారు. సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర మంత్రిగా కాకా వెంకటస్వామి సింగరేణి అభివృద్ధికి ఎంతో కృషి చేశార న్నారు. సంస్థ నష్టాల్లోకి వెళ్తే ఎన్టీపీసీ నుంచి లోన్ ఇప్పించి లాభాల్లోకి వచ్చేలా చొరవచూపి లక్ష మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారన్నారు.
కార్మికులకు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన గొప్ప నేత అన్నారు. సింగరేణి ప్రాంతం, కార్మికులతో కాకాకు విడదీయలేని అనుబంధం ఉందని అందుకే మంచిర్యాల జిల్లా ముఖద్వారం అయిన ఇందారం చౌరస్తాకు కాకా పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.