సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి సూసైడ్

 సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి సూసైడ్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు సూసైడ్  చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణం రామవరానికి చెందిన సింగరేణి కార్మికుడు రఘు కొడుకు హేమసాగర్(28) హైదరాబాద్​లో ప్రైవేట్  జాబ్ చేస్తున్నాడు. బుధవారం తన కారులో హైదరాబాద్​లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లవ్  ఫెయిల్యూర్  కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఒకసారి హేమసాగర్  ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.