రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

యాదాద్రి భువనగిరి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఉదయం జరిగింది. కూనూరు గ్రామం దగ్గర ఎదురెదురుగా వస్తున్న యాక్టీవా, బైక్ ఢీకొట్టడంతో మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన తీగాల సాగర్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వీరవెల్లికి చెందిన సాగర్, అతడి తమ్ముడు సందీప్(19) తో కలిసి బైక్ పై పెద్ద కందుకూరుకు పోయి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు గ్రామస్థులు. విషయం తెలుసుకున్న వీరవెల్లి, కూనూరు గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని  భువనగిరి ఏరియా హస్పిటల్ కి తరలించారు. గాయపడ్డవారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్పి ఉంది.