- మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాస రావు
మెదక్ టౌన్, వెలుగు: మెదక్జిల్లాను బాలల భద్రత, రక్షణ సంక్షేమంపై అగ్రగామిగా నిలిచేలా కృషి చేయాలని కలెక్టర్ప్రతిమాసింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మెదక్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన చైల్డ్ కేర్ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే యువతకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఎగ్జిబిషన్ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ బాలల భద్రతపై, మత్తు పదార్థాల నివారణపై జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలన్నారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలికలకు స్పోర్ట్స్కిట్స్పంపిణీ చేశారు. కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీడబ్ల్యూవో హేమభార్గవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్టీసీ డీఎం సురేఖ, ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్జీవో సునీత, తదితరులు పాల్గొన్నారు.

