
కూకట్పల్లి, వెలుగు: నా లవర్తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఓ యువకుడితో గొడవ పడిన మరో యువకుడు బ్లేడ్తో అతని గొంతు కోసి పరారయ్యాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటకు చెందిన బోస్ అలియాస్భాస్కర్, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి బ్రేకప్అయ్యారు. తర్వాత జనతానగర్కు చెందిన బతవల్ బర్దన్ తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రతీ ఆదివారం చర్చి వద్ద కలిసి మాట్లాడుకోవడం భాస్కర్చూస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం చర్చి నుంచి బయటకు వచ్చిన బర్దన్తో అతను గొడవ పడ్డాడు.
తన లవర్తో ఎందుకు మాట్లాడుతున్నావని ఘర్షణ పడ్డాడు. అనంతరం క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న బ్లేడ్తో బర్దన్గొంతు కోసి పారిపోయాడు. తీవ్ర గాయాలైన బాధితుడిని అక్కడున్నవారు ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.