సూర్యాపేట జిల్లా: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. జనం పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొంటున్నారు. తమ సమస్యలు, కష్టాలను షర్మిలతో పంచుకుంటున్నారు. నిన్న ఉగాది పండుగ సందర్భంగా పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చిన షర్మిల ఇవాళ ఆదివారం పాదయాత్రను మళ్లీ ప్రారంభించింది. మిర్యాల క్రాస్, లింగంపల్లె, మంచంపల్లె మీదుగా యాత్ర సాగనుంది. సాయంత్రం ఎస్. ఆత్మకూరు మండలంలోని కొత్తడూడెం గ్రామంలో మాట-ముచ్చటలో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి
కానిస్టేబుల్ పై దాడి చేసిన ఎద్దు
దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ బాదుడు.. ఇవాళ ఎంతంటే